సీజేఐపై సమాజ్‌వాదీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, , 22 అక్టోబర్ (హి.స.)భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను తప్పుబడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని భాజపా డిమాండు చేసింది. అయితే తాను సీజేఐని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, ద
సీజేఐపై సమాజ్‌వాదీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, , 22 అక్టోబర్ (హి.స.)భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను తప్పుబడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని భాజపా డిమాండు చేసింది. అయితే తాను సీజేఐని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని రాంగోపాల్‌ కోరారు. అయోధ్య సమస్యకు పరిష్కారం చూపాలని తాను దేవుడిని ప్రార్థించానని, ఎవరైనా విశ్వాసం ఉంచితే దేవుడే దారిచూపుతాడని అర్థమైందని పుణెలో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించాలని రాంగోపాల్‌ యాదవ్‌ను మీడియా కోరగా.. తాను స్పందించబోనని అంటూనే చనిపోయిన వ్యక్తిని వెనక్కి తీసుకొస్తే దయ్యంగా మారతారని, వెంటపడతారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande