ఉగ్రవాదుల ఆచూకీకి బలగాల జల్లెడ
శ్రీనగర్‌22 అక్టోబర్ (హి.స.)జమ్మూకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌ వద్ద సొరంగ నిర్మాణ ప్రదేశం వద్ద ఉగ్రవాదులు దాడి జరిపిన ప్రాంతాన్ని భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. స్థానికేతర కూలీలు, వైద్యుడితో పాటు ఏడుగురిని ఆదివారం రాత్రి బలిగొన్న ఘటనను బలగాలు తీవ్రంగా
ఉగ్రవాదుల ఆచూకీకి బలగాల జల్లెడ


శ్రీనగర్‌22 అక్టోబర్ (హి.స.)జమ్మూకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌ వద్ద సొరంగ నిర్మాణ ప్రదేశం వద్ద ఉగ్రవాదులు దాడి జరిపిన ప్రాంతాన్ని భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. స్థానికేతర కూలీలు, వైద్యుడితో పాటు ఏడుగురిని ఆదివారం రాత్రి బలిగొన్న ఘటనను బలగాలు తీవ్రంగా పరిగణించి.. ఉగ్రవాదుల ఆచూకీ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాడి చేసినవారు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులేనని, వారు ఆ ప్రాంతాన్ని ముందుగానే క్షుణ్నంగా పరిశీలించారని భావిస్తున్నారు. లేదంటే స్థానికులెవరైనా వారికి సహకరించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande