ఉప్పల్లో రేపు జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కి ప్రత్యేక బస్సులు.. సజ్జనార్
తెలంగాణ: క్రీడలు: మార్చి 26 (హిం.స)తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ని రాజీవ్ గాంధీ జాతీయ క్
ఉప్పల్లో రేపు జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కి ప్రత్యేక బస్సులు.. సజ్జనార్


తెలంగాణ: క్రీడలు: మార్చి 26 (హిం.స)తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ని రాజీవ్ గాంధీ జాతీయ క్రీడా మైదానం ఉప్పల్ నందు ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ క్రమంలో బుధవారం అనగా రేపు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడుపుతోందని చెప్పారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోందన్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande