ఢిల్లీ : 28 మార్చ్ (హింస)మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీ న్యాయస్థానం పొడిగించింది.
ఏప్రిల్ 1వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ అధికారులు ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరిచారు.
మద్యం కేసులో కేజ్రీవాల్ను ఇంకా విచారించేందుకు మరో ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోరగా.. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్