తెలంగాణ వినోదం మార్చి 29 (హిం.స)టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా గ్యాప్ తరువాత ప్రతినిధి 2 సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను
మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ''వచ్చి ఓటేయండి, లేదా దేశం వదిలి వెళ్లిపోండి, లేదా చచ్చిపోండి'' వంటి డైలాగ్ లతో టీజర్ ఆకట్టుకుంటోంది. త్వరలో ఎన్నికలు వస్తున్న సమయంలో ఇలాంటి పొలిటికల్ టీజర్ రావడం గమనార్హం.
సంపత్రావు హిందుస్థాన్ సమాచారం