కెసిఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తాం.. కోమటిరెడ్డి బ్రదర్స్ కు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరిక
తెలంగాణ నల్గొండ ఏప్రిల్ 18 (హిం.స) నేను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ఫైటర్ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు
కెసిఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తాం.. కోమటిరెడ్డి బ్రదర్స్ కు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరిక


తెలంగాణ నల్గొండ ఏప్రిల్ 18 (హిం.స)

నేను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ఫైటర్ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకి పోయే దమ్మున్న నాయకుడిని. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది” అంటూ కోమటిరెడ్డి సోదరులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండలో గురువారం

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ఆర్ వద్ద కోమటిరెడ్డి సోదరులు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి

బూట్లు తుడుస్తున్నారు కోమటిరెడ్డి అన్నదమ్ములు అంటూ వ్యాఖ్యలు చేశారు. “నా చరిత్ర ఎంటో, మీ చరిత్ర ఏంటో చర్చ పెడదామా” అంటూ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ బీజేపీ మనిషే అని.. బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీక్ లు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande