అమరావతి ,,ఏప్రిల్ (హిం.స) ఈ రోజు ఉదయం 11.00 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందన ఏపీ ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా (AP Election Commission CEO MK Meena) వెల్లడించారు. గురువారం అమరావతిలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు.
26వ తేదీన నామినేషన్లు పరిశీలన ఉంటుందన్నారు. ఇక 29వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ గడువు ఉంటుందని స్పష్టం చేశారు. 6 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ ఉంటుందని వివరించారు. అయితే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ పోలింగ్ ఉంటుందని చెప్పారు.
హిందుస్థాన్ సమాచార నాగరాజ్