ఇంఫాల్: ,25ఏప్రిల్ (హిం.స) మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో సేనాపతి జిల్లాలో 150పైగా నిత్యావసర సరకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్పోక్పీ జిల్లాలోని కౌబ్రు లేకా, సపర్మినాలను కలిపే వంతెనపై బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో పేలుడు జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు
హిందుస్థాన్ సమాచార నాగరాజ్