విజయవాడ,25 ఏప్రిల్ (హిం.స): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ) ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం ఉదయం 47 డివిజన్ కొండ ప్రాంతంలో సుజనాచౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా కొండ ప్రాంత ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం (తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యాచరణతో సమస్యలు పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్