రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
కోల్కతా: ,25ఏప్రిల్ (హిం.స) రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ
 గౌతమానంద్‌జీ


కోల్కతా: ,25ఏప్రిల్ (హిం.స) రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. గత నెలలో కోల్కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్ వారసుడిగా గౌతమానంద్జీ బాధ్యతలు చేపట్టారు. మఠానికి సంబంధించిన ట్రస్టీల బోర్డు బుధవారం బేలూర్ మఠంలో సమావేశమై 95 ఏళ్ల గౌతమానంద్జీని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande