విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): ఎన్నికల వేళ తనకు ప్రాణహాని ఉందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి(జేడి) లక్ష్మీనారాయణ శుక్రవారం విశాఖ సీపీ రవిశంకర్కు ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.