వైకాపా నుండి టిడిపిలోకి....
శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): నరసన్నపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం చల్లాయివలస పంచా
వైకాపా నుండి టిడిపిలోకి....


శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): నరసన్నపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం చల్లాయివలస పంచాయతీ నుండి యాట్లబసివలస మాజీ నీటి సంఘం అధ్యక్షుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు సంతిరావు రామన్న తో పాటు 80 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి, కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఉరజాం మాజీ ఎంపిటిసి సభ్యుడు కిల్లి మోహనరావు, వార్డు సభ్యులు సంపతిరావు వాసుదేవరావు, రాజు, రోణంకి తిరుపతిరావు, బొడ్డేపల్లి శ్రీనివాసరావు తో పాటు 50 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి, కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి, ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భైరి భాస్కరరావు , మాజీ ఎంపిపి తమ్మినేని భూషణ్ రావు , మాజీ జెడ్పీటీసీ రోణంకి కృష్ణన్నాయుడు తేజేశ్వరరావు , తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande