కరీంనగర్లో కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరికలు
కరీంనగర్ ఏప్రిల్ 27 (హిం.స) కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసార
కరీంనగర్లో కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరికలు


కరీంనగర్ ఏప్రిల్ 27 (హిం.స)

కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు హస్తంకు గుడ్ బై చెప్పి కాషాయ పార్టీలో చేరారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు.

శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్తోపాటు తెలంగాణ ఉద్యమకారులు కుమార్ తదితరులు తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్ లు పాల్గొన్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande