అమరావతి:27 ఏప్రిల్ (హిం.స) సార్వత్రిక ఎన్నికల్లో శుక్రవారం పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు రిటర్నింగ్ అధికారులు రెండ్రోజుల సమయం తీసుకున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 47, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి అత్యల్పంగా 16 దాఖలయ్యాయి.
హిందూస్తాన్ సమాచార రాజీవ్