వాశిం:27 ఏప్రిల్ (హిం.స) మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. మహారాష్ట్రలోని వాశిం జిల్లా బెల్ఖేడ్ గ్రామానికి చెందిన రైతు కుమారుడు నీల్కృష్ణ గజారే(19) జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో దేశంలోని ప్రథమ ర్యాంకు సాధించారు. ఈ పరీక్షల కోసం రోజుకు 10 గంటలకు పైనే చదివినట్లు ఆయన తెలిపారు. నీల్కృష్ణ క్రీడల్లో సైతం రాణిస్తున్నాడని, విలువిద్యలో జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నాడని ఆయన తండ్రి నిర్మల్ గజారే తెలిపారు. ఐఐటీ బొంబాయిలో చదువుకుని, సైంటిస్ట్ కావడం తన లక్ష్యమని నీల్కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం అతను వచ్చే నెల జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్