అమరావతి 27 ఏప్రిల్ (హిం.స)ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో క్లారిటీ ఇస్తూ వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి పేర్కొంటూ.. పెన్షన్ను 2028లో రూ.250, 2029లో మరో రూ.250 చొప్పున ఐదో ఏడాదికి రూ.3,500కు పెంచుతామని హామీ ఇచ్చారు. పాత హామీలకే రంగులద్ది కొత్త మేనిఫెస్టోలో చేర్చారు. ఇక రాజధాని అంశాన్ని వైసీపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. విశాఖను పరిపాలన రాజధానిగా అభివృద్ధి చేస్తామని, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పొందుపర్చారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్