కీలక పోరుకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్ జట్టు. చెన్నై వేదికగా సౌత్ ఆఫ్రికా తో నేడు ఆఖరు టీ 20 మ్యాచ్
టీం ఇండియా మహిళా జట్టు


Telangana, స్పోర్ట్స్.9 జూలై (హి.స.)

భారత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో నేడు చెన్నయ్ వేదికగా ఆఖరి టీ20 జరగనుంది. తొలి మ్యాచ్లో సఫారీలు నెగ్గగా.. రెండో టీ20 వర్షం కారణంగా రద్దైంది. దీంతో సిరీస్లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉండగా... ఆఖరి మ్యాచ్లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓడితే సిరీస్ కోల్పోతుంది. ఈ నేపథ్యంలో హర్మన్ ప్రీత్ జట్టు ఆఖరి మ్యాచ్లో నెగ్గి సిరీస్ సమం చేయాలని పంతంతో ఉన్నది. మరోవైపు, వన్డే సిరీస్, ఏకైక టెస్టు కోల్పోయి సఫారీలు టీ20 సిరీస్లోనైనా ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు.

కీలకమైన మూడో టీ20లో బౌలర్లు రాణించడంపై భారత్ విజయం ఆధారపడి ఉంది. సౌతాఫ్రికా జట్టులో తాజ్మన్ బ్రిట్స్ దూకుడుకు కళ్లెం వేయాల్సి ఉంది. అలాగే, కెప్టెన్ వొల్వార్డ్, మారిజన్నే కాప్, అన్నేకే బోష్ ఫామ్లో

ఉన్నారు. మరి, టీమిండియా ఆఖరి మ్యాచ్లో గెలిచి సిరీసు సమం చేస్తుందా? లేదంటే ఓడి సిరీస్ ను సమర్పిస్తుందా? చూడాలి.

హిందూస్తాన్ సమచార్ / Bachu Ranjith Kumar / నాగరాజ్ రావు


 rajesh pande