హైదరాబాద్, క్రైమ్, 17 సెప్టెంబర్ (హి.స.)
మైనర్ బాలికపై 36 సంవత్సరాల వ్యక్తి
అత్యాచారం చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు 8 వ తరగతి చదువుతున్న మైనర్ భాలికను భయభ్రాంతులకు గురి చేసి కేశవరెడ్డి అనే వ్యక్తి ఈ నెల 16 న సాయంత్రం రూం లో బంధించి
అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్ స్టేషన్
లో ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు, నిందితుడు పరారీలో ఉన్నట్లు
అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టానున్నారని సమాచారం. మేడిపల్లి సీఐ, సిబ్బంది వినాయక
నిమజ్ఞం విధులలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..