బంగ్లాదేశీయుల అక్రమ వలసల బాధ్యత బీజేపీ, అమిత్ షాదే..
తెలంగాణ/ఏ.పీ, 21 జనవరి (హి.స.) సైఫ్ ఆలీఖాన్ పై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశీయుడిగా తేలింది.ఈ వ్యవహారంపై శివసేన ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం కేంద్రాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు. ముంబై ఇప్పటికీ సురక్షిత నగరమే. ముంబైలో అక్
శివసేన ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్


తెలంగాణ/ఏ.పీ, 21 జనవరి (హి.స.) సైఫ్ ఆలీఖాన్ పై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశీయుడిగా తేలింది.ఈ వ్యవహారంపై శివసేన ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం కేంద్రాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు. ముంబై ఇప్పటికీ సురక్షిత నగరమే. ముంబైలో అక్రమ బంగ్లాదేశీయులు ఉంటే, అది మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు.

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ప్రశ్నిస్తూ.. దేశంలో అక్రమ బంగ్లాదేశీయులు ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు..? కేంద్ర హోం మంత్రి, కేంద్ర రక్షణ మంత్రి ఏం చేస్తున్నారు..? ప్రభుత్వం అక్రమ వలసల్ని ఎందుకు సమర్థవంతంగా నిరోధించలేదు..?” అని సంజయ్ రౌత్ అడిగారు. ఎన్నికలు జరిగే ప్రతీసారి బీజేపీ అక్రమ బంగ్లాదేశ్ వలసల్ని తెరపైకి తెస్తుందని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక కథనాన్ని సృష్టించి, ప్రజల దృష్టి మరల్చేందుకు దీనిని ఒక సాకుగా బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande