సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని గట్టెక్కించింది  చంద్రబాబే.. తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్..
ఏ.పీ, విశాఖ. 21 జనవరి (హి.స.) నాడు నష్టాల్లో ఉన్నప్పుడు గానీ… నేడు సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని గట్టెక్కించింది మాత్రం చంద్రబాబు ఒక్కరేనని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ పేర్కొన్నారు. తన కేసుల కోసం రాష్ట్రం మొత్తాన్ని జగన్ తాకట్టు పె
విశాఖ స్టీల్


ఏ.పీ, విశాఖ. 21 జనవరి (హి.స.)

నాడు నష్టాల్లో ఉన్నప్పుడు గానీ… నేడు సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని గట్టెక్కించింది మాత్రం చంద్రబాబు ఒక్కరేనని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ పేర్కొన్నారు. తన కేసుల కోసం రాష్ట్రం మొత్తాన్ని జగన్ తాకట్టు పెడితే, ఉత్తరాంధ్ర, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పెద్దలను ఒప్పిస్తున్నారని గుర్తు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుందన్న ఆయన, మండలానికి ఒక క్లస్టర్ను ఏర్పాటు చేస్తే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తిరువూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు కృషితోనే ఉక్కు ఆర్థిక భరోసా లభించిందన్నారు. ఉత్తరాంధ్ర కే కాకుండా మొత్తం ఏపీకే మణిహారంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఉందని, నాడు ఎంతో మంది విరోచిత పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న సంస్థను పునరుజ్జీవించ‌డానికి ఎన్డీఏ ప్రయత్నిస్తుందని, దానికి అనుకూలంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం శుభ పరిణామమ‌న్నారు. కేసుల నుండి విముక్తి కల్పించండి, కావాలంటే ఏపీ రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లే వారిని, దానికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేడు చంద్రబాబు వెళ్లి వస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం మంచి శుభవార్తను చెబుతూనే ఉందని, తాజాగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కు భారీ ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం ఇందుకు నిదర్శనమ‌న్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande