విజయవాడ, 2 అక్టోబర్ (హి.స.)
:ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు( అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల చివరి రోజున రాజరాజేశ్వరిదేవి ( అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు తీసుకుంటున్నారు. కాగా, ఉదయం నుంచే భక్తులు బారులు తీరడంతో క్యూలైన్లు కిక్కిరిపోతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ