అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)
:పట్టణంలోని ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతాహి 10కే మారథాన్” ఇశాళ(గురువారం) నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, శుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ఈ మారథాన్ విజయవాడ ఉత్సవ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, సినీ హీరో శర్వానంద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ