
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 19 నవంబర్ (హి.స.)
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ మహిళా నేత, అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో పార్టీ పని తీరును తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు చేశారు. కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని.. అందుకు తగిన విధంగా వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. 10, 20, 30 ఏళ్ల క్రితం పని చేసినట్లుగా ఇప్పుడు పని చేయలేకపోతున్నట్లు వాపోయారు.
ప్రస్తుతం వేరే ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామని.. ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నప్పుడు ఇప్పుడు వెళ్తున్న మార్గం సరైంది కాదన్నారు. ప్రస్తుత వ్యవస్థతో పోరాడే మార్గం వేరేగా ఉండాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి తప్పుడు సలహాలు ఇస్తున్నారా? అని మీడియా ప్రతినిధి అడిగితే.. ఎవరు తప్పుడు సలహాలు ఇస్తున్నారో.. సరైన సలహాలు ఇస్తున్నారో తనకు తెలియదని.. ఎన్నికల్లో మాత్రం గెలవడం లేదని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ