
హాంకాంగ్, 27 నవంబర్ (హి.స.)హాంకాంగ్లోని తైపో ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. వాంగ్ ఫక్ కోర్టు అనే నివాస సముదాయంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 44 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. . మరోవైపు, ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 279 మంది కనిపించడం లేదని అధికారులు ప్రకటించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాయపడిన వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్లో 8 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాక్లో 31 అంతస్తుల నిర్మాణం ఉంది. దాదాపు 2,000 అపార్ట్మెంట్లలో 4,800 మంది నివసిస్తున్నారు. మంటలు ఇంత వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణాలను అధికారులు గుర్తించారు. ఈ అపార్ట్మెంట్ల బయటి గోడల నిర్మాణం వెదురు బొంగుతో చేశారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ సమయంలో వాడిన నెట్ తొలగించలేదు. మంటలు వ్యాపించే సమయంలో భారీగా గాలులు వీయడం వల్ల అగ్నికీలలు ఇతర టవర్లకూ పాకి, అవి కూడా తగలబడ్డాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV