
ఉత్తరాఖండ్, 9 నవంబర్ (హి.స.)
కొండ రాష్ట్రం ఉత్తరాఖండ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లో రూ.8,260 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. వివిధ రంగాల్లో అది సాధించిన సమగ్ర పురోగతిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. ఉత్తరాఖండ్ లో రూ.2 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పనులు జరుగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు