
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం హకీంపేట్ ఎయిర్పోర్ట్లో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి స్వాగతం పలికారు. కాగా, శీతాకాల విడిదిలో భాగంగా.. డిసెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు అంటే.. మొత్తం ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. డిసెంబర్ 19వ తేదీన రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 11.00 గంటలకు ఈ ఫిలిం సిటీ వేదికగా జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. డిసెంబర్ 20న తేదీన గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరిగే సదస్సుకు ముర్ము హాజరవుతారు. హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతకట్టుదిట్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..