
చెన్నై20డిసెంబర్ (హి.స.) రాష్ట్రం కొచ్చిలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్లో బాలింతపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటన మానవత్వానికే మచ్చగా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ తరహా దారుణానికి పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలింత పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఆమెపై దౌర్జన్యం చేయడం అమానవీయమని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, 2024 జూన్ 18న కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ చంద్రన్, శైమోల్ ఎన్.జే అనే బాలింతను తోసి, అనంతరం చెంపదెబ్బ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించడంతో, అధికార యంత్రాంగం స్పందించి సంబంధిత పోలీస్ అధికారిని సస్పెండ్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ