తిరుపతి: 1 మార్చి (హి.స.)
నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. గది నంబర్ 314లో పీవోపీతో చేసిన సీలింగ్ ఊడిపడింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వేరే చోటుకి తరలించారు. అనంతరం హోటల్ను సీజ్ చేశారు. ఈ ప్రమాదం నుంచి భక్తులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల