న్యూఢిల్లీ ,13 మార్చి (హి.స.) అశ్వినీ వైష్ణవ్ రైళ్లలో మెనూ ప్రదర్శన తప్పనిసరి: అశ్వినీ వైష్ణవ్ 13 మార్చి (హి.స.)రైళ్లలో అందించే ఆహార పదార్థాల మెనూ, ధరల పట్టిక వివరాలు ప్రయాణికులకు తెలియజేసేలా ప్రదర్శించడం తప్పనిసరి అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం లోక్సభకు తెలిపారు. ప్రయాణికుల సమాచారం కోసం రైళ్లలో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల మెనూ కార్డు, ధరలు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, ముద్రించిన మెనూ కార్డులు వెయిటర్ల వద్ద అందుబాటులో ఉంచామని, ప్రయాణికులు అడిగితే వాటిని అందిస్తామని ఆయన లిఖిత పూర్వకంగా సభకు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు