మడకశిర, 30 మార్చి (హి.స.)
పండగపూట శ్రీసత్యసాయి జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. మడకశిరలోని గాంధీ బజారులో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబంలోని నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు.
మృతులు కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్, భువనేశ్గా గుర్తించారు.
హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి