తెలంగాణ, నర్సంపేట. 18 ఏప్రిల్ (హి.స.)
ప్రభుత్వం అందించే మద్దతు
ధరను ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మందపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని రైతులకు సూచించారు.
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు