ఢిల్లీ 19 ఏప్రిల్ (హి.స.)
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు విమాన ప్రయాణంలో తీవ్ర అసౌకర్యం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానాన్ని గంటల తరబడి గాల్లోనే ఉంచి, అర్ధరాత్రి సమయంలో జైపూర్కు మళ్లించడంతో ఢిల్లీ విమానాశ్రయ అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ నుంచి ఢిల్లీకి బయలుదేరిన తమ విమానం దాదాపు 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిందని, ఆపై ఉన్నట్టుండి దాన్ని జైపూర్కు మళ్లించారని ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
మరోవైపు, శనివారం శ్రీనగర్లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో జమ్మూ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక విమానాలు ఆలస్యమవ్వగా, కొన్ని రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఇండిగో సంస్థ కూడా ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకునే వెసులుబాటును పరిశీలించాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి