పెగడ్స్.స్పై వేర్ వ్యవహారం 2021 లో సంచలనం
న్యూఢిల్లీ, 29 ఏప్రిల్ (హి.స.) :పెగాసస్ ) స్పైవేర్ వ్యవహారం 2021లో సంచలనమైంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పైవేర్‌తో పాత్రికేయుు, పౌరసమాజం ప్రముఖులపై నిఘా పెట్టారంటూ అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవా
పెగడ్స్.స్పై వేర్ వ్యవహారం 2021 లో సంచలనం


న్యూఢిల్లీ, 29 ఏప్రిల్ (హి.స.)

:పెగాసస్ ) స్పైవేర్ వ్యవహారం 2021లో సంచలనమైంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పైవేర్‌తో పాత్రికేయుు, పౌరసమాజం ప్రముఖులపై నిఘా పెట్టారంటూ అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రత కోసం స్పైవేర్ ఉపయోగించడంలో తప్పులేదని స్పష్టం చేసింది. గుఢచర్యం ఆరోపణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇన్వెస్టిగేషన్ నివేదికను బహిర్గతం చేయలేమని, ఇది దేశ భద్రత, సార్వభౌమాధికారిని సంబంధించిన అంశమని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసునని, మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande