అయోధ్య రామ్.మందిరంలో 42 అడుగుల.ధ్వజస్తంభం ప్రతిష్ట
విజయవాడ, 30 ఏప్రిల్ (హి.స.)అక్షయ తృతీయ వేళ అయోధ్య రామమందిర శిఖరంపై ధ్వజస్తంభం ప్రతిష్ఠించే క్రతువును పూర్తిచేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. 42 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభాన్ని హిందూ క్యాలెండరు ప్ర
అయోధ్య రామ్.మందిరంలో 42 అడుగుల.ధ్వజస్తంభం ప్రతిష్ట


విజయవాడ, 30 ఏప్రిల్ (హి.స.)అక్షయ తృతీయ వేళ అయోధ్య రామమందిర శిఖరంపై ధ్వజస్తంభం ప్రతిష్ఠించే క్రతువును పూర్తిచేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. 42 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభాన్ని హిందూ క్యాలెండరు ప్రకారం వైశాఖ శుక్లపక్ష ద్వితీయ ముహూర్తంలో ఉదయం 8 గంటలకు ప్రతిష్ఠించినట్లు తెలిపారు. సంబంధిత చిత్రాలను సోషల్‌ మీడియా వేదికగా ఆయన పంచుకున్నారు. రామమందిరంలో ఏడు మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించారు. రామ్‌దర్బార్‌లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande