విజయవాడ, 3 మే (హి.స.)సిద్ధమైన డీపీఆర్ను తొలుత హెచ్ఏఎంఎల్ బోర్డు ఆమోదం తెలపాలి. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఎండీతో పాటు ఐదుగురు డైరెక్టర్లు ఉన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమలు, ఐటీ శాఖ, ఆర్ అండ్ బీ కార్యదర్శులు, హెచ్ఎండీఏ కమిషనర్ డైరెక్టర్లుగా ఉన్నారు.... :ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచన మేరకు జేబీఎస్ వద్ద 30 ఎకరాల్లో ప్రపంచస్థాయి మెట్రో హబ్ను అభివృద్ధి చేయాలనే ప్రణాళికలున్నాయి. ఇటీవల సీఎంతో పాటు జపాన్ వెళ్లి వచ్చిన మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి అక్కడి అనుభవాలను మెట్రో హబ్కు జోడించేలా ప్రణాళికల రూపకల్పనపై దృష్టిపెట్టారు. జపాన్లో బుల్లెట్ రైలు, మెట్రో, రైలు సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానంగా, ఒక రైలు నుంచి మరో రైలుకు సులభంగా మారొచ్చు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల