ఆ బాధ్యత కలెక్టర్లదే.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశం
హైదరాబాద్, 17 జూన్ (హి.స.) తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ వల్ల చేసిన తప్పిదాలతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం
మంత్రి పొంగులేటి


హైదరాబాద్, 17 జూన్ (హి.స.)

తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ వల్ల చేసిన తప్పిదాలతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూ భారతి చట్టం ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని మంగళవారం తనను కలిసిన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, నిజామాబాద్ కలెక్టర్ వినయకృష్ణారెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంత్ సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో భూములకు సంబంధించి రైతులు అనుభవించిన కష్టాలకు, బాధలకు విముక్తి కల్పించేలా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande