నారాయణపేట, 17 జూన్ (హి.స.)
కూరగాయలు పండించడం వల్ల రైతులకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉందని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దామరగిద్దలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా బిద్ గ్రామ పంచాయతీ శివారులో ఉన్న శంకర్ పొలం వద్ద కలెక్టర్ కాసేపు ఆగారు. కాకరకాయ, సొర, టమాటా పంటలను పరిశీలించారు. హాని బాక్స్లపై అవగాహన కల్పించి రైతులకు వాటిని అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా గత్ప గ్రామంలో నిర్వహిస్తున్న భూ భారతి రైతు సదస్సు కేంద్రాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో నిర్వహించిన సదస్సులో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనే వివరాలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి నోటిస్ ఇవ్వాలని, అనంతరం పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరు అయ్యాయి..? అందులో గ్రౌండింగ్ ఎంత అయిందని అడిగి తెలుసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..