చివ‌రి క్షణాల్లో ఊపిరి .. నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా
న్యూఢిల్లీ, 15 జూలై (హి.స.) హ‌త్య కేసులో దోషిగా యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు తాత్కాలిక ఊర‌ట ల‌భించింది.. బ్ల‌డ్ మ‌నీ – క్ష‌మాధ‌నం ఇచ్చే విష‌యంలో బాధిత కుంటుంబీకుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న నేప‌థ్యంలో ఆమె మ‌ర‌ణ శిక్ష‌న
నిమిష ప్రియ


న్యూఢిల్లీ, 15 జూలై (హి.స.)

హ‌త్య కేసులో దోషిగా యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు తాత్కాలిక ఊర‌ట ల‌భించింది.. బ్ల‌డ్ మ‌నీ – క్ష‌మాధ‌నం ఇచ్చే విష‌యంలో బాధిత కుంటుంబీకుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న నేప‌థ్యంలో ఆమె మ‌ర‌ణ శిక్ష‌ను తాత్కాలికంగా నిలిపి వేస్తున‌ట్లు యెమ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది..ఈ మ‌ర‌ణ‌శిక్ష‌ను నిలుపుద‌ల చేయించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపిన కేంద్రం ఎట్ట‌కేల‌కు మ‌ర‌ణ శిక్ష‌ను వాయిదా వేయించ‌గ‌లిగింది.. ఇదే స‌మ‌యంలో ‘బ్లడ్‌ మనీపై ఇప్పటికే బాధిత కుటుంబంతో భారత్కు చెందిన ఓ ప్రముఖ మత గురువు చర్చలు జరుపుతున్నారు. నిమిష ప్రియ ను శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్‌ ఇండియా అబూబకర్‌ ముస్లియార్‌ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధిత కుటుంబంతో పాటు యెమెన్ స్థానిక అధికారులు, అక్కడి మత పెద్దలతో ఆయన మాట్లాడుతున్నారు. బ్లడ్ మనీని అంగీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించ‌డంలో మ‌త గురువు విజ‌యం సాధించిన‌ట్లు స‌మాచారం .. దాదాపు మిలియ‌న్ డాల‌ర్లు భార‌త క‌రెన్సీలో 8.60 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిన‌ట్లు యెమ‌న్ నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి..

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande