
తెలంగాణ, 11 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల
ప్రక్రియ ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్కు సమయం ఉండగా.. క్యూలో ఉన్నవారికి 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోలింగ్ సరళి ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (Municipal Election Exit Polls) వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని 'పీపుల్స్ పల్స్' ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. నిజామాబాద్, కరీంనగర్ను బీజేపీ దక్కించుకుంటుందని, బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్నూ సొంతం చేసుకోలేదని పేర్కొంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68-76, బీఆర్ఎస్ 29-36, బిజెపి 3-5, mim 0-1, ఇతరులు 8-14 దక్కించుకుంటారని పేర్కొంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు