
ములుగు, 03 ఫిబ్రవరి (హి.స.)
మేడారం జాతరపై కావాలనే తప్పుడు
ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. గత కొంతకాలంగా క్లాస్ ప్రజలు కూడా జాతరకు వస్తున్నారని, ఈసారి జాతరకు మరింత ఎక్కువ మంది హైక్లాస్ ప్రజలు వచ్చారని చెప్పారు. దీనిని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని అక్కడేముంది.. ఊరుదేవుళ్లే కదా అని వ్యాఖ్యానించిన పూజారులు, పీఠాధిపతులు జీర్ణించుకోలేకపోతున్నారని వారి వెనుక కొన్ని రాజకీయపార్టీలు ఉన్నాయన్నారు. వ్యాఖ్యానించారు.
ఇంటి ఇలవేల్పుగా ఉన్న దేవతలు ఇప్పుడు ప్రపంచ దేవతలుగా మారారని అన్నారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు