లాభాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్
హైదరాబాద్, 18 మార్చి (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు అనూహ్యమైన లాభాలతో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందుతున్న సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. బ
Stock market


హైదరాబాద్, 18 మార్చి (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు

అనూహ్యమైన లాభాలతో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందుతున్న సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. బుధవారం ఉదయం మార్కెట్ ప్రారంభం నుండే బుల్ రన్ కొనసాగుతోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఒకానొక దశలో 858 పాయింట్లు ఎగబాకి 76,929.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 1:00 గంటల సమయానికి సెన్సెక్స్ 666.78 2 (0.88%) పాయింట్ల76,737.62 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా నిఫ్టీ-50 కూడా 192.15 పాయింట్ల (0.81%) వృద్ధితో 23,773.30 వద్ద కొనసాగుతోంది. గత రెండు సెషన్ల నుండి కనిపిస్తున్న ఈ సానుకూల ధోరణి నేడు మరింత బలపడటం మార్కెట్ స్థిరత్వాన్ని సూచిస్తోంది. ఉదయం 9:15 గంటలకు 300 పాయింట్ల లాభంతో మొదలైన ప్రయాణం, సమయం గడిచేకొద్దీ మరింత పుంజుకోవడం విశేషం. నేటి మార్కెట్లు మరింత పెరిగే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande