పామునైనా నమ్మొచ్చుకానీ బీజేపీని నమ్మవద్దు మమతా బెనర్జీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ బీజేపై నిప్పులు చెరిగారు
పామునైనా నమ్మొచ్చుకానీ బీజేపీని నమ్మవద్దు మమతా బెనర్జీ


కలకత్తా, 11 ఏప్రిల్ (హి.స.)ఈశాన్య రాష్ట్రాల ప్రజల నుంచి ఓట్లను సాధించగలమన్న నమ్మకం కోల్పోయినందునే బీజేపీ అస్సాం ఎన్నికల కోసం వెలుపల నుంచి ప్రజలను తీసుకువచ్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తెంతులియా వద్ద ఓ ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కింద దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలు నిష్పాక్షితను కోల్పోయాయని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను బీజేపీ కొనేసిందంటూ ఆమె ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఓ రైలు నిండా 50,000 మందిని అస్సాంకు తీసుకువచ్చారు అని ఆమె ఆరోపించారు. పామునైనా నమ్మొచ్చునేమో కాని బీజేపీని మాత్రం కాదని ఆమె విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande