
హైదరాబాద్, 14 ఏప్రిల్ (హి.స.)రాయ్పూర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఓ ప్రయాణికుడు వచ్చాడు. అతడి లగేజీని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఫోన్ బ్యాటరీ పేలింది. దీంతో అక్కడున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్