ఎండ తీవ్రత.. ప్రజలకు మంత్రి సీతక్క కీలక సూచనలు
ఎండ తీవ్రత.. ప్రజలకు మంత్రి సీతక్క కీలక సూచనలు
సీతక్క


హైదరాబాద్, 15 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు రావొద్దని సూచించారు. సాధ్యమైనంత వరకు పనులను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పూర్తి చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటివద్ద ఉండటం మంచిదని అన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తలకు టోపీ లేదా తలపాగా పెట్టుకోవాలని, శరీరాన్ని ఎండ నుంచి రక్షించుకోవాలని సూచించారు. జాగ్రత్తలు పాటించాలని లేదంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ చలివేంద్రాలను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande