
చెన్నై, 03 ఏప్రిల్ (హి.స.)తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 27 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు విడుదల చేసింది. డీఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. శ్రీపెరుంబుదూరు నుంచి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన శ్రీపెరుంబుదూరు నుంచి పోటీ చేసి ఏఐఏడీఎంకే అబ్యర్థి కె.పళనిపై 11,000 అధిక్యంతో గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దురై చంద్రశేఖర్ మరోసారి పొన్నేరి నుంచి పోటీ చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మార్చి 30న ప్రారంభమైంది. ఏప్రిల్ 6వ తేదీతో నామినేషన్ల సమర్పణ గడువు ముగియనుంది. ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్