యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం.. యూనిట్-3 లో చెలరేగిన మంటలు
యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం.. యూనిట్-3 లో చెలరేగిన మంటలు
Fire


నల్గొండ, 17 మే (హి.స.)

నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ స్టేషన్ (YATP) లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్లోని యూనిట్-3 పరిధిలో గల టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఆదివారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజినీర్లు భయాందోళనలకు గురయ్యారు. పంప్ వద్ద ఉన్న లూబ్రికేషన్ ఆయిల్ లీకేజీ కావడం వల్లే ఈ మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చమురు లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో ప్లాంట్ ఆవరణ అంతటా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.

ప్రమాద తీవ్రతకు పంప్ పరిధిలోని కంట్రోల్ కేబుల్స్, కొన్ని కీలకమైన వాల్వ్లు పూర్తిగా కాలిపోయి దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే, అక్కడే ఉన్న అగ్నిమాపక యంత్రాలు, ప్లాంట్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రధాన యంత్రాలకు (మెయిన్ టర్బైన్లు, బాయిలర్లు) ఒక భారీ ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న జెన్కో(TGGENCO) ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు మరియు ప్రమాద గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అంతర్గత దర్యాప్తుకు ఆదేశించారు. సమాచారం

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande