
తిరుమల, 04 మే (హి.స.)
: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ట్రస్టుకు భారీ విరాళం అందింది. భువనేశ్వర్కు చెందిన బలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం తితిదే శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,000 విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర తిరుమలలోని తితిదే అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ