

న్యూఢిల్లీ, 20 జూన్ (హి.స.)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆమెకు హృదయపూర్వక
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో వెనుకబడిన, అణగారిన వర్గాల సంక్షేమం పట్ల ఆమెకున్న ప్రత్యేక శ్రద్ధను, ప్రజాసేవ పట్ల ఆమె చూపుతున్న అచంచలమైన అంకితభావాన్ని ప్రధాని
ప్రత్యేకంగా కొనియాడారు. ధైర్యం, సరళత, వినమ్రతలతో కూడిన ఆమె జీవన ప్రస్థానం దేశవ్యాప్తంగా కోట్లాది మంది
ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సామాజిక మాధ్యమం 'X' లో పేర్కొన్నారు. దేశ ప్రగతి కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో
ప్రేరణాత్మకమని శ్లాఘిస్తూ, ఆమె సుదీర్ఘకాలం పూర్ణ ఆయురారోగ్యాలతో
దేశ సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ
ప్రత్యేక సందర్భంలో,
ఒడిశా ప్రభుత్వ
రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో నిర్వహించనున్న 'వికాస్ రా ధార, ఒడిశా సార' (Vikas ra Dhara, Odisha Sara) కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము కలిసి ఒడిశాలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలోని పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను సందర్శించడంతో పాటు, రూ. 47,600 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి
ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ గ్రామీణ మరియు
గిరిజన ప్రాంతాల పర్యటన ద్వారా అక్కడి విద్యావకాశాలను, సామాజిక-ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడమే లక్ష్యంగా
పెట్టుకున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్
కేజ్రీవాల్ సైతం రాష్ట్రపతి ముర్ముకు ప్రత్యేకంగా జన్మదిన అభినందనలు తెలుపుతూ
ఆమెకు సుదీర్ఘ ఆయుష్షు లభించాలని ఆకాంక్షించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi