ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ
Durga


విజయవాడ, 12 జూలై (హి.స.)

, :ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారినిదర్శించుకునేందుకు ఈరోజు(ఆదివారం) భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సెలవు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే ఆలయానికి భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. భక్తులు భారీగా తరలి రావడంతో, సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నిరకాల వీఐపీ (VIP) దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు.

దీనివల్ల క్యూ లైన్లలోని సామాన్య భక్తులు అమ్మవారిని అత్యంత వేగంగా, సులభంగా దర్శించుకున్నారు. నూతన నీటి సరఫరా విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త నీటి సరఫరా విధానాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలోని భక్తుల వద్దకే నేరుగా సరికొత్త మొబైల్ వాటర్ క్యాన్ల (సంచార నీటి డబ్బాల) ద్వారా చల్లని తాగునీటిని ఆలయ సిబ్బంది అందజేశారు. అలాగే, ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదానం విరివిగా పంపిణీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande