రేవంత్పై ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ ఫిర్యాదు.
ఓటరు జాబితాలో పేరు లేకుంటే సంక్షేమ పథకాలు అందవంటూ సీఎం రేవంత్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.
Revanth reddy


హైదరాబాద్, 26 జూలై (హి.స.)ఓటరు జాబితాలో పేరు లేకుంటే సంక్షేమ పథకాలు అందవంటూ సీఎం రేవంత్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. సీఎం హెచ్చరిక అభ్యంతరకరమని బీజేపీ ఎన్నికల వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన, సీఎం రేవంత్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పి.సుదర్శన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సీఎం రేవంత్కు నోటీసులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande